News & Views

చర్చ : హైదరాబాద్ / జగద్గిరిగుట్ట , హైదరాబాద్ నగరంలో పూర్తిగా అదుపుతప్పిన లా అండ్ ఆర్డర్…

నడిరోడ్డులో యువకుడిపై కత్తి దాడిపై మరో కోణం

• హైదరాబాద్ నగరంలో పూర్తిగా అదుపుతప్పిన లా అండ్ ఆర్డర్

బుధవారం జగద్గిరిగుట్ట బస్టాండ్ సమీపంలో పట్టపగలు తన స్నేహితుడు రోషన్ సింగ్ పై కత్తితో దాడి చేసిన బాలశౌ రెడ్డి అనే వ్యక్తి

తీవ్ర గాయాలతో అక్కడి నుండి పారిపోయిన రోషన్

రక్తపు మడుగుల్లో ఉన్న రోషన్ ను చూసి భయాందోళనకు గురైన స్థానిక ప్రజలు

ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

చర్చ,  హైదరాబాద్‌లో పట్టపగలే కత్తులతో నరికి రౌడీ షీటర్ హత్య సంచలనం రేపుతున్నాయి. ఓ ట్రాన్స్‌జెండర్‌ను అత్యాచారం చేసి డబ్బు చెల్లించే విషయంలో స్నేహితుల మధ్య గొడవ జరిగి హత్య చేసినట్లు తెలుస్తుంది. జగద్గిరిగుట్ట ప్రాంతంలో ఓ ట్రాన్స్‌జెండర్‌ను 15 రోజుల క్రితం నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేసిన రోషన్ సింగ్(25), మరో ఆరుగురు మిత్రులు డబ్బు చెల్లింపు విషయంలో గొడవ జరగగా వీరిపై బాలానగర్ పోలీస్ స్టేషన్‌లో ట్రాన్స్‌జెండర్‌ ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన పోలీసులు
ట్రాన్స్‌జెండర్‌ను తమపై కేసు పెట్టమని బాలశౌ రెడ్డి ఉసిగొల్పాడని, అతన్ని ఎలాగైనా చంపేస్తానని స్నేహితులతో చెప్పిన రోషన్ సింగ్, ఇది కాస్త తన చెవిలో పడడంతో వాడు నన్ను చంపడమేంటి నేనే వాడిని చంపుతానని పగబట్టిన బాలశౌ రెడ్డి, బుధవారం సాయంత్రం మద్యం తాగి జగద్గిరిగుట్ట బస్టాండ్ వద్దకు వచ్చిన రోషన్ సింగ్, బాలశౌ రెడ్డి, అతని స్నేహితులు ఆదిల్, మహమ్మద్, ఈ సందర్భంలో ఇద్దరి మధ్య గొడవ జరగగా.. రోషన్ సింగ్ చేతులను వెనక నుండి పట్టుకున్న మహమ్మద్.. అతన్ని దారుణంగా కత్తితో పొడిచి పారిపోయిన బాలశౌ రెడ్డి, తీవ్ర గాయాలతో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన రోషన్ సింగ్, కేసు నమోదు చేసుకొని నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు, మృతుడు రోషన్ సింగ్, నిందితులు బాలశౌ రెడ్డి, ఆదిల్, మహమ్మద్‌లపై ఇప్పటికే పలు కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు.