చర్చ : కొనరావుపేట , రాజన్న సిరిసిల్ల జిల్లా, తేనెటీగల దాడి..15 మంది పత్తి కూలీలకు తీవ్ర గాయాలు..
తేనెటీగల దాడి..15 మంది పత్తి కూలీలకు తీవ్ర గాయాలు..


తేనెటీగల దాడి..15 మంది పత్తి కూలీలకు తీవ్ర గాయాలు..
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని వెంకట్రావుపేట గ్రామానికి చెందిన దాదాపు 15 మంది పత్తి కూలీలపై తేనెటీగలు ఒకేసారి దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలయ్యారు.ఈ ఘటన కనగర్తి సుద్దాల మధ్య జరిగింది.వివరాల్లోకి వెళ్తే.. వెంకట్రావుపేట గ్రామానికి చెందిన 15 మంది కూలీలు ఉదయం పత్తి చేనులో పని చేస్తుండగా, సమీపంలోని తేనెపట్టు నుంచి ఒక్కసారిగా తేనెటీగల గుంపు వారిపై దాడి చేసింది. తేనెటీగల దాడి తీవ్రత ఎక్కువగా ఉండటంతో కూలీలు భయంతో పరుగులు తీశారు. దాడిలో పలువురు కూలీలు స్పృహ కోల్పోయారు. మరికొందరు తేనెటీగల కుట్టడంతో నొప్పితో రోదిస్తూ కనిపించారు. కూలీల ఆర్తనాదాలు విన్న స్థానికులు, చుట్టుపక్కల పొలాల్లో ఉన్న రైతులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారి సహాయంతో గాయపడిన కూలీలను హుటాహుటిన చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఒకేసారి ఇంతమంది కూలీలపై తేనెటీగలు దాడి చేయడం స్థానికంగా ఆందోళన కలిగించింది. సకాలంలో స్థానికులు స్పందించడం వల్ల పెను ప్రమాదం తప్పింది. కూలీలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు..