News & Views

చర్చ,పెద్దపల్లి: మరణించిన వారి ఆత్మ శాంతికై కొవత్తుల ర్యాలీ…  

చర్చ,పెద్దపల్లి ప్రతినిధి:
డిల్లీలో ఉగ్రదాడిని నిరసిస్తూ….

మరణించిన వారి ఆత్మ శాంతికై కొవత్తుల ర్యాలీ…

ఉగ్రవాదం ఏం రూపంలో ఉన్నా కూకటివేళ్ళతో పెకిలించాల్సిన అవసరం ఉందని, డిల్లీలో టెర్రరిస్టులు జరిపిన కారుబాంబు దాడిలో మరణించిన భారతీయులకు ఆత్మ శాంతి కై పెద్దపల్లి ప్రెస్ క్లబ్ ఆద్వర్యంలో అమరవీరుల స్థూపం నుండి కొవ్వొత్తులతో శాంతిర్యాలీ నిర్వహించి నివాళులు అర్పించారు.

ఈ సందర్బంగా పెద్దపల్లి ప్రెస్ క్లబ్ అద్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ పాకిస్తాన్ ప్రేరేపిత టెర్రరిస్టులు జరిపిన దాడిని ప్రతి భారతీయుడు ఖండిచాలన్నారు. ఉగ్రవాదంపై ఉక్కుపాదాన్ని మోపాలని, కేంద్రప్రభుత్వం టెర్రరిస్టులకు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. దేశంలో ఉన్న అంతర్గత ఉగ్రవాదుల ఏరివేతను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. భవిశ్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సి.ఐ.ప్రవీణ్ కుమార్, ట్రాఫిక్ సిఐ అనిల్ కుమార్, ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శీ కొల్లూరి గోపాల్, ఉపాధ్యక్షుడు బెజ్జంకి నరేష్, కోశాధికారి ఆరెళ్ళి మల్లేష్, ముద్దసాని సమ్మయ్య, ప్రసాద్, శిలారపు కిషన్, తిరుపతి యాదవ్, లైశెట్టి రాజు, కళ్యాన్, తిరుపతి, శ్రీనివాస్, మల్లేష్, రేవెళ్ళి తిరుపతి, గుర్రం వంశీ, షకీల్, అంజి, ప్రవీణ్ రెడ్డి, వెంకటేష్, జంగ సంపత్, రాజేందర్, అవునూరి సంపత్, మారుపాక అంజి తదితరులు పాల్గొన్నారు