చర్చ : రంగారెడ్డి బస్సు బాధితులకు ప్రధాని నరేంద్ర మోదీ గారు సానుభూతి తెలుపుతూ పిఎం ఎన్ఆర్ఎఫ్ నుండి నష్టపరిహారం ప్రకటించారు…
పిఎం ఎన్ఆర్ఎఫ్ నుండి నష్టపరిహారం
బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి రెండు లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు.
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో జరిగిన దుర్ఘటనలో సంభవించిన ప్రాణనష్టం నన్ను చాలా బాధించింది. ఈ క్లిష్ట సమయంలో బాధితులు, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.
మరణించిన వారి కుటుంబానికి పీఎంఎన్ ఆర్ ఎఫ్ నుండి రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున నష్ట పరిహారాన్ని అందిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు.