చర్చ : నల్గొండ జిల్లా , అంగన్వాడీ ఆయా నిర్లక్ష్యం.. నీటి గుంతలో పడి బాలుడు మృతి…

అంగన్వాడీ ఆయా నిర్లక్ష్యం.. నీటి గుంతలో పడి బాలుడు మృతి..!!
నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం కాసనగోడులో అంగన్వాడీ ఆయా నిర్లక్ష్యంతో అయాన్ అనే నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. ఆయా సోమవారం అంగన్వాడీ కేంద్రం నుంచి 300 మీటర్ల దూరంలో ఉన్న గుంత వద్దకు బహిర్భుమికి తీసుకెళ్లింది. అక్కడ కడుక్కునేందుకు వెళ్లిన అతను జారి పడాడ్డు. చుట్టుపక్కల వారు బాలుడిని బయటకు తీసేలోపే మృతి చెందాడు. తల్లిదండ్రులు, బంధువులు అంగన్వాడీ టీచర్, ఆయా నిర్లక్ష్యంతోనే మరణించాడని ఆందోళన చేశారు..!!