చర్చ, గోదావరిఖని :గ్రామ దేవతల విగ్రహాల కూల్చివేత.

చర్చ, గోదావరిఖని :గ్రామ దేవతల విగ్రహాల కూల్చివేత..
అగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు ,హిందూ సంఘాలు…
పట్టణ అభివృద్ధి, రోడ్ల విస్తరణ పేరుతో అధికారులు, అధికార పార్టీ నేతలు పైశాచికత్వానికి పాల్పడుతున్నారని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఇదే క్రమంలో పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని రోడ్ల మధ్యలో, రోడ్డుకు ఇరు పక్కల, వివిధ కాలనీలలో ఉన్న గ్రామ దేవత గుడిలను కార్పొరేషన్ అధికారులు రాత్రికి రాత్రే కూల్చివేశారు. దీంతో తెల్లవారి సరికి పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాంతాలను, కుటుంబాలను చల్లగా చూడాలనే ఉద్దేశంతో గ్రామదేవతలకు ఏడాదికి ఒకసారి పెద్ద ఎత్తున స్థానికులు గ్రామ దేవతలకు చిన్నపాటి గుడులను నిర్మించుకొని పూజలు చేస్తుంటారు. ఇవి కూడా అభివృద్దికి, రోడ్ల విస్తరణకు అడ్డుగా ఉన్నాయనే ఉద్దేశంతో అధికారులు పైశాచికత్వానికి పాల్పడటం పట్ల ప్రజలు, ప్రతిపక్ష నేతలు దుమ్మెత్తి పోస్తున్నారు. పట్టణంలోని సుమారు 50 కి పైగా గ్రామ దేవతలు పోచమ్మ, మైసమ్మ, వేల్పులమ్మ గుడులను నేలమట్టం చేయడాన్ని జనాలు వ్యతిరేకిస్తున్నారు. దీనిపై హిందూ సంఘాలు సైతం కోపోద్రిక్తులవుతున్నారు. కార్పొరేషన్ అధికారులా… గుర్తుతెలియని వ్యక్తులా… అనే దానిపై వన్ టౌన్ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఏది ఏమైనా అధికారులు ఇలాంటి ఆకృత్యాలకు పాల్పడడం పట్ల జనాలలో తీవ్ర వ్యతిరేక భావాలు ఏర్పడుతున్నాయి. ఈ విషయంలో రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ సరైన విధానం కాదని పేర్కొన్నారు.
ఈ విషయంలో హిందూ సంఘాలు ,స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..