పంచాయతీ ఎన్నికలకు లైన్ క్లియర్
- జీవో 46పై హైకోర్టులో విచారణ ప్రారంభమైంది.
- ఈ దశలో పంచాయతీ ఎన్నికల్లో తాము జోక్యం చేసుకోలేమని, స్టే విధించలేమని కోర్టు స్పష్టం చేసింది.
పంచాయతీ ఎన్నికల్లో సబ్ కేటగిరి రిజర్వేషన్లపై 6 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
రిజర్వేషన్ లేనందుకే ఎన్నికలు రద్దు చేయాలనుకుంటున్నారా? అని పిటిషనర్ను ప్రశ్నించింది.
తదుపరి విచారణను 2 నెలలకు వాయిదా వేసింది.