చర్చ, కొత్తగూడెం : డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ప్రారంభోత్సవానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం జిల్లాలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ప్రారంభోత్సవానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఏనుముల రేవంత్ రెడ్డి మరియు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కొత్తగూడెం హెలిప్యాడికి సాయంత్రం 4:52 నిమిషములకు చేరుకున్నారు. తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ మరియు గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మాత్యులు పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి , వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు మరియు ఖమ్మం జిల్లా ఎంపీ రామ్ సహాయం రఘురామారెడ్డి , మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ , అటవీశాఖ అభివృద్ధి చైర్మన్ పోదేం వీరయ్య, ఎమ్మెల్యేలు కొత్తగూడెం కునంనేని సాంబశివరావు, పినపాక పాయం వెంకటేశ్వర్లు, ఇల్లందు కోరం కనకయ్య, సత్తుపల్లి మట్టారాగమయీ, భద్రాచలం తెల్లం వెంకట్రావు, వైరా రామ్ దాస్ నాయక్, అశ్వరావుపేట జారే ఆదినారాయణ,జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మరియు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ అధికారులు హెలిప్యాడ్ దగ్గర ఘనంగా స్వాగతం పలికారు.