News & Views

చర్చ బెల్లంపల్లి : కాంగ్రెస్ మోసపూరిత హామీలను ప్రజలకు గుర్తు చేసిన మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య

చర్చ బెల్లంపల్లి

బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 31వ వార్డులో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ పార్టీ హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన మోసపూరిత హామీలపై రూపొందించిన బాకీ కార్డును ఇంటింటికి పంపిణీ చేసి అవగాహన కల్పించారు.
రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి బండారి స్రవంతి–ప్రవీణ్కు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మున్సిపాలిటీ ఎన్నికల బీఆర్‌ఎస్ పార్టీ ఇంఛార్జిలు నగేష్ ముదిరాజ్, రవీందర్ రెడ్డి, స్రవంతి–ప్రవీణ్, బీఆర్‌ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సత్యనారాయణ, పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు