సూర్యాపేట జిల్లా….హుజూర్ నగర్ లో నాగమయ్య పుట్ట దగ్గర నాగుల చవితి సందర్భంగా మహిళా భక్తులు భారీ ఎత్తున తరలి వచ్చారు. మహిళలు నాగమయ్య పుట్టలో పాలు పోసి, కార్తీక దీపాలు వెలిగించి, స్వామివారినీ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వచ్చిన భక్తులకు నాగమయ్య కమిటీ తీర్థప్రసాదాలు అందించారు.