చర్చ : బస్తర్ , మావోయిస్టు ఉద్యమానికి మరో భారీ దెబ్బ! డివిజన్ కమిటీ కార్యదర్శి ముఖేష్ సహా 21 మంది మావోయిస్టులు ఆయుధాలతో లొంగిబాటు…

Breaking news
చర్చ : బస్తర్
మావోయిస్టు ఉద్యమానికి మరో భారీ దెబ్బ!
డివిజన్ కమిటీ కార్యదర్శి ముఖేష్ సహా 21 మంది మావోయిస్టులు ఆయుధాలతో లొంగిబాటు
– 18 ఆయుధాలు అప్పగింత
– 13 మహిళా, 8 పురుష మావోయిస్టులు జన జీవనస్రవంతిలోకి
బస్తర్ రేంజ్లోని కంకేర్ జిల్లాలో పునఃసమైక్యత ద్వారా పునరావాసం కార్యక్రమం క
ఆదివారం మరో ముఖ్యమైన ఘట్టం చోటుచేసుకుంది. మావోయిస్టు పార్టీ డివిజన్ కమిటీ కార్యదర్శి ముఖేష్ సహా కేష్కల్ డివిజన్ (నార్త్ సబ్ జోనల్ బ్యూరో)కి చెందిన కుమారి, కిస్కోడో ఏరియా కమిటీ నుండి మొత్తం 21 మంది మావోయిస్టులు తమ ఆయుధాలతో ప్రభుత్వ పునరావాస పథకాన్ని అంగీకరించి జన జీవనస్రవంతిలో చేరారు. లొంగిపోయిన వారిలో నలుగురు డివిసిఎం సభ్యులు, తొమ్మిది మంది ఎసిఎం సభ్యులు, ఎనిమిది మంది పార్టీ సభ్యులు ఉన్నారు. లొంగిపోయిన వారిలో 13 మంది మహిళలు, ఎనిమిది మంది పురుషులు హింసా భావజాలాన్ని విడిచిపెట్టి శాంతి, పురోగతి కోసం లొంగిపోయినట్లు బస్త్రం ఐజీ సుందర్ రాజు తెలిపారు. మావోయిస్టుల లొంగిపోయిన సమయంలో మూడు ఏకే-47 రైఫిల్స్, నాలుగు ఎస్ఎల్ఆర్ రైఫిల్స్, రెండు ఇన్సాస్ రైఫిల్స్,
ఆరు 303 రైఫిల్స్, రెండు సింగిల్ షాట్ రైఫిల్స్, ఒక బీజీఎల్ ఆయుధాలు ఉన్నట్లు వివరించారు.
లొంగిపోయిన 21 మంది మావోయిస్టుల పునరావాసం, సమాజంలో తిరిగి ఏకీకరణ కోసం అధికారిక, చట్టపరమైన ప్రక్రియ ప్రారంభమైనట్లు ఆయన స్పష్టం చేశారు.